తన గొంతును ఎత్తి మాట్లాడటంలో, తన ఉనికిని సవాల్ చేసే వాటికి ఎదురు నిలవడంలో కమల్ హాసన్ ఎప్పుడూ ‘తగ్గేదేలే’ మూడ్లోనే ఉంటాడు. సినిమా వంటి ఆర్ట్ ఫార్మ్ కావచ్చు, రాజకీయ వ్యాఖ్యలే కావచ్చు. ఏ ఇష్యూకైనా సున్నితంగా వెళ్లడం ఆయన స్టైల్ కాదు. తాజాగా, ‘థగ్ లైఫ్’ వివాదంలోనూ ఆయన అదే ధోరణిని కొనసాగిస్తున్నాడు. కానీ ఈసారి ఇండియాలోని అత్యున్నత న్యాయస్థానం నుంచే కమల్ కు షాక్ తగిలింది!
కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా మీద నిషేధం కొనసాగుతుండగా, కమల్ హాసన్ ఇప్పటికే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా కోర్టు పరోక్షంగా క్షమాపణలే పరిష్కారమని సంకేతాలు ఇచ్చింది. దాంతో, ఆయన టీం ఒకింత తొందరపడుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. “థియేటర్లకు బెదిరింపులు వస్తున్నాయి, Article 32 ప్రకారం రక్షణ ఇవ్వండి” అంటూ పిటిషన్ వేసింది.
కానీ, జస్టిస్ పీకే మిశ్రా అధ్యక్షతన విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు…
👉 “ఇది హైకోర్టు పరిధిలో ఉన్న కేసు. మేమేం చేయలేం. మొదట అక్కడికి వెళ్లండి” అంటూ క్లారిటీ ఇచ్చేసింది.
👉 పిటిషన్ను స్వీకరించకుండా, తీవ్ర వ్యాఖ్యలు లేకుండా గమ్మత్తుగా తిరస్కరించింది.
ఇంతలో, ఈ కేసు పట్ల కమల్ హాసన్ ధోరణిని చూసిన పరిశీలకులు ఒక్క మాట చెబుతున్నారు – “ఈసారి కమల్ ముట్టుకున్నది కన్నడ భాషపై అభిమానుల గౌరవం. ఆ విషయంలో తగ్గనేది ఆయన ధైర్యంగా అనవచ్చు కానీ, దాని మూల్యాన్ని ఆయన సినిమాగా అనుభవిస్తోంది!”
‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’ అన్న కామెంట్కి వ్యతిరేకంగా
కన్నడ సంఘాలు, ఫిల్మ్ చాంబర్ నిషేధం విధించాయి. హైకోర్టు ఈ అంశంపై అప్పటికే విచారణ జరుపుతుండగా, కమల్ తన టీమ్తో కలిసి మరోసారి వివాదంలో అడుగుపెట్టి, సుప్రీం డోర్ తట్టాడు. కానీ అక్కడ తలుపు తెరవలేదు.
ఇప్పుడు జూన్ 10న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఆ తీర్పే ఈ సినిమాకు ఓ డైరెక్షన్ ఇస్తుందా? లేక ‘థగ్ లైఫ్’ మరింతగా కర్ణాటకలో చిక్కుకుంటుందా? అన్నదే చర్చ. ఏదేమైనా, కమల్ హాసన్ తాను ఎంచుకున్న వివాదపూరిత దారిలో వెళ్తూనే ఉన్నాడు. కానీ ఆ దారి – ఇప్పుడు ఓ ‘లీగల్ డెడ్ ఎండ్’ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది!